'రైటర్ పద్మభూషణ్‌' అందరినీ ఎంటర్‌టైన్ చేస్తాడు: సుహాన్

by Disha Web Desk 17 |
రైటర్ పద్మభూషణ్‌ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తాడు: సుహాన్
X

దిశ, సినిమా: యంగ్ హీరో సుహాస్, టీనా శిల్పా రాజ్ కలయికలో వస్తున్న చిత్రం 'రైటర్ పద్మభూషణ్‌'. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్‌పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించారు. జి. మనోహర్ సమర్పణలో షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించాడు. కాగా ఫిబ్రవరి 3న మూవీ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నాడు సుహాస్.


'ఈ కథ చెప్పాగానే ఎగ్జయిట్ అయ్యా. పద్మభూషణ్‌ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తాడు. క్లైమాక్స్‌కు అందరు కనెక్ట్ అవుతారు. ఫస్ట్ హాఫ్‌లో రెండు, సెకండ్ హాఫ్‌లో మూడు ట్విస్ట్‌లున్నాయి. ప్రతి మలుపులో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. అరవై రోజులు అనుకున్న సినిమాను 43 రోజుల్లోనే పూర్తి చేశాం. టీమ్ అంతా ఒకటిగా ఉంటూ అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చాం. ఇలాంటి మరిన్ని మంచి కథలతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తాం' అని చెప్పుకొచ్చాడు.

READ MORE

10th క్లాస్ మెమో షేర్ చేసిన Samantha. ఎన్ని మార్కులో తెలుసా?

Next Story